తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.లక్ష్మీనరసింహం ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు నెల్లూరులోని లక్ష్మీనరసింహం నివాసంలో తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనరసింహం నివాసంతో పాటు నెల్లూరు, ఒంగోలు, కావలి, రాజమండ్రిలో బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో అధికారులు భారీగా నగదు, నగలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.