కర్ణాటక శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వరదలు సహా పలు కీలక అంశాలపై అధికార బిజెపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడిఎస్ వ్యూహ రచన చేశాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రెండవసారి శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్పై చర్చ, ఆమోదం ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.