ఇసుక కొరతతో లక్షలాది పేదల కుటుంబాల పొట్ట కొట్టారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. పండుగపూట పేద కుటుంబాలు పస్తులుండే దుస్థితి తెచ్చారన్నారు. నిర్మాణ రంగ కార్మికులను అప్పులపాలు చేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారన్నారని, ఇంకెన్నాళ్లి ఇసుక కష్టాలు? అని ప్రశ్నించారు. పేదల పొట్టకొట్టి వైసీపీ నేతల జేబులు నింపే ఆకృత్యాలు చేస్తున్నారన్నారు.