ఇప్పటికే ఎన్నో అద్భుతమైనకార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు… ఇప్పుడు మరోసారి జీ కుటుంబం అవార్డులతోమెస్మెరైజ్ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియంలో 9వ జీ కుటుంబంఅవార్డ్స్2019 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్శ్రియ శరణ్, హెబ్బా పటేల్, లావణ్యా త్రిపాఠి, యామిని, సునందమాల శెట్టి, తనూజ గౌడ్, అశ్విన్.., బ్లఫ్మాస్టర్,బ్రోచేవారెవరురా ఫేం సత్యదేవ్.. ఈ జీ కుటుంబం అవార్డ్స్ 2019కు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ అవార్డులకార్యక్రమంలో సినీతారల డ్యాన్సులు, జీ కుటుంబ సభ్యులు అద్దిరిపోయే పర్ఫార్మెన్స్లు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ చూడని రీతిలో జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది జీ తెలుగు. నిధిఅగర్వాల్, అవికాగోర్, సుడిగాలి సుధీర్.. తమ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారు.