ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ ను దర్శించుకున్న సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గమ్మను దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. తల్లి ఆశీర్వాదంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా దేవాలయ అధికారులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు కృష్ణంరాజు దంపతులకు మహదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు కనకదుర్గ చిత్రపటం, లడ్డూలు అందచేశారు.