తమిళనాడులోని తిరుచ్చిలో గల లలిత జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనం కేసు కీలక మలుపు తిరిగింది. అక్టోబరు 2న నగల దుకాణంలో దాదాపు రూ.13 కోట్లకు పైగా విలువైన వజ్ర, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టాయి. దీనికి సంబంధించి తిరువారూరు మండలానికి చెందిన మణికంఠన్ పట్టుబడగా అతని వద్ద నాలుగున్నర కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠన్ ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సంచలన విషయాలను బయట పెట్టాడు. సురేశ్, అతని మామ మురుగన్ కలిసి 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లామని తెలిపాడు. ఇదిలా ఉండగా మురుగన్ రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో శ్రీలంకకు పారిపోయినట్లు తెలిసింది. నగలతో పాటు ఓ ప్రముఖ సినీ నటిని వెంట బెట్టుకుని వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేలింది. మురుగన్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ఇళ్లు, బ్యాంకుల్లో దోపిడీలు చేస్తూ ఆ సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటు. కొన్నేళ్ల నుంచి సినీ నటులకు డబ్బులు ఆశచూపి లైంగికంగా వాడుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు మోడళ్లతో కలిసి టూర్లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దొంగిలించిన సొమ్ముతో తన స్వస్థలం తిరువరూర్ ను డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న మురుగన్ ఓ ఖరిదైన వాహనంలో సంచారం జీవితం గడుపుతున్నాడని, కాగా మురుగన్ ఎయిడ్స్ రోగి అని తేలింది. మురుగన్ తెలుగురాష్ట్రాల్లో కూడా దొంగ తనాలకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్, చిత్తూరు జిల్లాలోని బ్యాంకుల్లో చోరీలకు పాల్పడ్డాడు.