ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2019, 05:24 PM

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ పథకాలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిసి ఉంటాయి. పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా ఆ క్రెడిట్ కేంద్రానికి దక్కదు. చాలా మందికి రాష్ట్రమే ఆ పథకాలను అమలు చేస్తున్నట్టుగా తెలుసు. అయితే ఇక అలా కాకుండా కేంద్రం సాయం చేస్తున్న పథకాలలో క్రెడిట్ కేంద్రానికే దక్కాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా పథకంలో కేంద్రానికి క్రెడిట్ ఇస్తున్నారు. పథకం ప్రారంభానికి సీఎం జగన్ ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. కానీ ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే దాని పై క్లారిటి లేదు. త్వరలోనే ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీంను ప్రధాని మోడీ పేరుతోనే అమలు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ పథకంలో రాష్ట్రం వాటా ఉన్నప్పటికి కేంద్రం వాటా ఎక్కువ ఉండడంతో కేంద్రానికే ఈ పథకం క్రెడిట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com