ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైద‌రాబాద్ టు విజ‌య‌వాడ కి బ‌స్ టిక్కెట్ 7 వేల‌ట‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 02:38 AM

 పండ‌గ సీజ‌న్‌లో   ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపరేటర్లు దందా అంతా ఇంతా కాదు.  తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి దసరా. ఈ క్ర‌మంలోనే అంద‌రూ సొంతూర్ల‌కు ప్ర‌యాన‌మ‌వుతారు. దీంతో రైళ్లు బస్సులు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరగటంతో ధరలను భారీగా పెంచాయి. మామూలుగా  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి 350 రూపాయల నుండి 1000 రూపాయల వరకు వ‌సూలు చేస్తాయి.  ఆయా బస్ ల స్ధాయి ప్ర‌కారం ఈ టికెట్ ధర ఉంటుంది.


పండ‌గ సీజ‌న్ కావ‌టంతో  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపరేటర్లు  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి  1000 రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు  ధ‌ర నిర్ణ‌యించేసి, అయిన‌కాడికి ప్ర‌యాణీకుల నుంచి లాగేయ‌టం ఆరంభించారు.  కానీ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ అయితే ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి టికెట్ ధర 7000 వేల రూపాయలు నిర్ణయించాడు. ఇది విమాన ప్ర‌యాణం క‌న్నా రెట్టింపు కావ‌టంతో నెటిజ‌న్లు భ‌గ్గు మంటున్నారు. 


  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా రేట్లు పెంచిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రేట్లు భారీగా పెంచినప్పటికీ దసరా పండక్కి ఇంటికి వెళ్లకుండా ఉండ‌లేరు క‌దా..! అన్న ధీమాలో ఆప‌రేట‌ర్లు ఉన్నార‌న్న విమ‌ర్శ‌లు బాగా వినిపిస్తున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com