మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 21వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాగపూర్ (సౌత్ వెస్ట్) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఫడ్నవీస్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు. నామినేషన్కు ముందు ఫడ్నవీస్ భారీ ర్యాలీ తీశారు. ఆచన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూమహాలో మరోమారు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని అన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. గత ఐదేళ్ల ప్రగే తమను ముందు నిలుపుతుందన్నారు.