ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ ను కలవరపెడుతున్న నేతలు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 03:28 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21 జరగనున్న నేపథ్యంలో నేతలు ఆ పార్టీని వీడడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు కలవరపడుతున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే తన కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కంకావ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నారాయణ్ రాణే బుధవారం ప్రకటించారు. బీజేపీ విడుదల చేసే రెండో జాబితాలో నితేష్ రాణే పేరు ఉంటుందని స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలలోపే నితేష్ రాణే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన నితేష్ రాణే.. ప్రస్తుతం బీజేపీలో చేరడంపట్ల కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com