ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అధికారులు చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనే సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్ మంజూరు విషయం జస్టిస్ రంజన్ గొగొయ్ వెల్లడిస్తారని తెలిపింది.