దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆభరణాల సంస్థగా పేరుగాంచిన లలితా జ్యుయెలరీలో దొంగలు పడ్డారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న లలితా జ్యుయెలరీ బ్రాంచిలో గోడకు కన్నమేసి షాపులో చొరబడిన దొంగలు 50 కేజీల బంగారంతో పాటు విలువైన వజ్రాలు కూడా ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు దొంగలు రెక్కీ చేసినట్టు నిర్ధారించారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ దోపిడీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్టు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు షురూ చేశారు.