ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2018లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంది. గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పును పున:సమీక్ష చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి గత ఉత్తర్వులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో యథావిధిగా తక్షణ అరెస్ట్ అమల్లోకి వస్తుంది. దేశంలో ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికే సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని పిటిషన్ విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం పేర్కొన్నది.