ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందన్నారు. గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వట్లేదు.. కూలీలకు సకాలంలో వేతనాలు లేవన్నారు. ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర మంత్రి, అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. రద్దులు, కూల్చివేతలతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందని చంద్రబాబు లేఖలో తెలిపారు.