కర్నూల్ జిల్లా, డోన్ మండల పరిధిలోని ఓబులాపురం గ్రామ సమీపంలో శనివారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. బెంగళూర్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు టీఎస్ 08 జీజీ 389 రోడ్డుపై చనిపోయి ఉన్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పింది. దీంతో కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్యవీరకుమార్ కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు.