ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పక్కపక్కనే పెట్రోలు బంకులు.. ధర 10 రూపాయలు తేడా ఎందుకో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 01:28 PM

మధ్యప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై 10 శాతం వ్యాట్ పెరిగిన నేపధ్యంలో వాటి ధరలు పెరిగాయి. ఫలితంగా గుజరాత్‌లోని పెట్రోలు బంకుల దగ్గర పెట్రోలు, డీజిల్‌కు మరింతగా డిమాండ్ పెరిగింది. గుజరాత్ పరిధిలోని దాహోద్, ఛోటా ఉదయ్‌పూర్‌లలో పెట్రోలు ధరల కన్నా... అక్కడికి సమీపంలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఝాబువా, అలీరాజ్‌పూర్‌లలో పెట్రోలు ధరలు రూ. 10 నుంచి 12 వరకూ అధికంగా ఉన్నాయి. డీజిల్ కూడా రూ. 2 నుంచి 3 వరకూ తేడా ఉంది. దీంతో గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న పెట్రోలు బంకుల వద్ద వాహదారులు బారులు తీరుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని పెట్రోలు బంకుల్లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 83.44, డీజిల్ లీటరు రూ. 74.24 గా ఉంది. ఇక గుజరాత్ విషయానికొస్తే పెట్రోల్ ధర రూ. 72.66, డీజిల్ ధర రూ. 71.30గా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్లే ఉన్నప్పటికీ పెట్రోలు ధరలో రూ. 10 తేడా కనిపిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్‌వాసులు గుజరాత్‌లో పెట్రోల్ కొనుగోలు చేయడం బెటరని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com