ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘనత చంద్రబాబుదే: లక్ష్మి పార్వతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 06:30 PM

వైసీపీ నేత లక్ష్మి పార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ట్విట్టర్ లో మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదే అంటూ విమర్శించారు. ఏనాడు కూడా లోకేశ్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు హయాంలో మొత్తం అవినీతే జరిగిందని, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల్లో దోపిడీకి పాల్పడ్డారన్నారు. కోడెల శివప్రసాద్ మృతదేహంతో చంద్రబాబు రాజకీయం చేశారని, ఆయన తీరు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజాధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com