కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట పట్టణం సత్యనారాయణపురం సమీపంలోని చిన్నేరు (ముల్లేరు)లో వికాస్ అనే బాలుడు శుక్రవారం గల్లంతై మృతి చెందాడు. అనుమంచిపల్లికి చెందిన లారీ డ్రైవర్ తన ఇద్దరు కుమారులతో కలిసి రెండు రోజుల క్రితమే సత్యనారాయణ పురానికి వచ్చారు. పెద్ద వాడైన వికాస్ స్థానిక ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. కొత్త ప్రాంతం కావడం వల్ల చూసేందుకు వెళ్లి నీటిలో మునిగాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. తండ్రి విధి నిర్వహణలో భాగంగా వేరే ఊరు వెళ్లగా విషయం తెలిసిన తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.