సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలను జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖలపై గురువారం జగన్ సమీక్ష చేపట్టారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యావరణ విధ్వంసాన్ని సహించేలేదని స్పష్టం చేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్ను విధిస్తామని వెల్లడించారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణకు అత్యుత్తమ విధానాలపై ప్రతిపాదనలు, అసెంబ్లీలో బిల్లులు రూపొందించాలన్నారు. గోదావరి జిల్లాల్లో పంట కాల్వల పరిరక్షణకు మిషన్ గోదావరి ప్రారంభించాలని తెలిపారు. ఇ-వ్యర్థాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. చెట్లను పెంచడంలో గ్రామ వాలంటీర్ల సహకారం ఉండాలని, ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. విశాఖ కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.