అమరావతి: రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. పెట్టుబడులపై ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు చర్చించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్ బృందం రాష్ట్రానికి వచ్చింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు మంత్రులు పెట్టుబడుల అనుకూలతను వివరించారు. డైరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ గ్రిడ్, ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.