కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా కిలో ఉల్లిని రూ25రూ అందించేందుకు సిద్దమవుతోంది. మహారాష్ట్ర నుండి మూడువందల టన్నుల ఉల్లిని కిలో రూ30 చొప్పున కొనుగోలుచేశామని, రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.