కర్నూల్ జిల్లా, ఆలూరు పట్టణంలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులకు వచ్చే నెల అక్టోబర్ 10 నుంచి కంటి పరీక్షలు చేయనున్నట్లు మొలగవల్లి పీహెచ్సీ డాక్టర్ మారుతీ కుమార్ అన్నారు. మంగళవారం ఆలూరు పట్టణంలో స్థానిక ఎంపీడీఓ సమావేశ భవనంలో ఎంపీడీఓ ఆకర్ సాహెబ్ అధ్యక్షతన ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆకర్ సాహెబ్, డాక్టర్ మారుతీ మాట్లాడారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారి చూపులో ఏమైనా లోపాలు ఉంటే సరిచేస్తారన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేయడంతో పాటు ఆపరేషన్లు చేస్తారన్నారు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలి దశలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తారన్నారు.