అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వ ర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పత్తి, వేరుశనగ పం టలు నీటి మునిగాయి. గుత్తి జెండా వీధిలో కప్పల వర్షం కురిసింది. వర్షాలకు పెద్ద కొండ చిలువ కొట్టుకొచ్చింది. యాడికి మండలం గుడిసెల, చెండ్రాయునిపల్లి గ్రామాలు జలమయమయ్యాయి. వేరుశనగ, పత్తి, కంది, జొన్న, కొర్ర, ఆముదం, మొక్కజొన్న పంటలు నీటి పాలయ్యాయి. 1500లకుపైగా చేనేత మగ్గాలు వరదలో మునిగిపోయాయి. వేములపాడులో 200 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. పెద్దవడుగూరులో నిద్రిస్తున్న వైష్ణవిపై మట్టిపెళ్లలు పడటంతో చనిపోయింది.