తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి విచ్చేసే భక్తకోటికి స్వచ్ఛమైన సేవలందిస్తూ వారి మనోభావాలను గౌరవిస్తూ, నిజాయితీగా సేవలను అందించాలని తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి కల్యాణకట్ట సిబ్బందికి పిలుపునిచ్చారు.
తిరుమలలోని అస్థాన మండపంలో మంగళవారం 1000 మంది క్షురకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబరు 8వ తేదీ ముగుస్తుందన్నారు. “తమిళ పెరటాసి నెల ఇప్పటికే ప్రారంభమైనందున, అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అంకితభావంతో సేవలందించాలన్నారు.
తరువాత అతను పురుషులు మరియు మహిళ క్షురకులతో మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాల తరువాత దశలవారీగా క్షురకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా క్షురకులు వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులకు అత్యుత్తమమైన సేవలను అందిస్తామని ప్రత్యేకాధికారికి హామీ ఇచ్చారు. అన్ని కళ్యాణకట్టలలో బ్లేడ్లు, చేతులకు గ్లౌజ్, ముఖానికి మాస్క్లు, టిష్యూ పేపర్లు హెపటైటిస్ బి వ్యాక్సిన్లు మొదలైన వాటి కొరత లేకుండా చూడాలని ఆయన డెప్యూటీ ఈవోను ఆదేశించారు.