శాంతి స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్న తనకి ఖచ్చితంగా నోబెల్ బహుమతి ఇవ్వాల్సి ఉన్నా నోబెల్ కమిటీ తనకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.
2009లో ఒబామాకు నోబెల్ ఎందుకు ఇచ్చారో ఎవరికి తెలియదని, కానీ ప్రపంచంలోని పలుదేశాల నడుమ విభేదాఉ పరిష్కరించి శాంతి నెలకొల్పేలా కృషి చేసానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంమయ్యాయి. పైగా భారత్-పాక్ అంగీకరిస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడంలో తాను సహకరిస్తానని ఈ సందర్భంగా మరోసారి ట్రంప్ వ్యాఖ్యానించడం చూస్తుంటే ప్రధాని మోడీని తన ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నట్టే ఇమ్రాన్ని కూడా వాడుకునే ఆస్కారం ఉందనిపిస్తోంది,