ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ కంపెనీలకు ఎదురు దెబ్బ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 02:42 PM

పిపిఏలపై పునఃసమీక్ష అంశంపై హైకోర్టు లో విద్యుత్ కంపెనీలకు ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని మళ్లీ  పరిశీలించే అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనలను హై కోర్టు తోసిపుచ్చింది. పీపీఏలను పునఃసమీక్షించేందుకు ఏపీఈఆర్సీ కి వెళ్తామన్న ప్రభుత్వ వాదనలను హై కోర్టు సమర్ధించింది. పీపీఏల పునఃసమీక్షను ఏపీఈఆర్సీ ముందే నిర్వహించాలని కూడా హై కోర్టు ఆదేశించింది. ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్దారించలేమని చెప్పింది హై కోర్టు.  ఆరునెల్లలోగా ఈ వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ తేల్చాలని కూడా సూచించింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుల కింద యూనిట్ కి రూ.2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హై కోర్ట్ అంగీకరించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com