జాతీయ పౌర పట్టిక తయారీకి తాము కేంద్రానికి అనుమతించేది లేదని స్పష్టం చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సోమవారం కోల్కతాలో కార్మిక సంఘాలతో భారీ ఎత్తున జరిగిన సమావేశంలోఆమె ప్రసంగిస్తూ, జాతీయ పౌరపట్టిక పేరుతో ఇప్పటికే రాష్టంరలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తన దృష్టిలో ఉందని, ఇక ఉపేక్షించబోనని, ‘నాపై విశ్వాసం ఉంచండి. నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు బెంగాల్లో ఎన్ఆర్ సి ప్రక్రియను ఎప్పటికీ అమలు కానీయను. ఇది అసోం ఒప్పందం కారణంగానే అక్కడ ఎన్ఆర్ సి ప్రక్రియ చేపట్టారన్నారు. , దీనిని దేశంలో అన్ని రాష్ట్రాలకు రుద్దేందుకు యత్నిస్తే సహించబోనని, బెంగాల్లోనే కాదు కార్మికులకు నష్టం చేస్తున్న ఈ ప్రక్రియ దేశంలో ఎక్కడా నిర్వహించేందుకు ఒప్పు కోం అని మమత తేల్చి చెప్పారు.