ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై లారీ-బస్సు ఢీ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 12:53 PM

రాజస్థాన్ : జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ-బస్సును ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించిన దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగర సమీపంలో జరిగింది. అజ్మీర్-బేవార్ జాతీయ రహదారిపై లామనా గ్రామం వద్ద వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.గాయపడిన వారిని అజ్మీర్, బేవార్ నగరాల్లోని అమృత్ కౌర్ ప్రభుత్వ, జేఎల్ఎన్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో 52 మంది ప్రయాణికులున్నారని వారిలో 8 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com