2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రయను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభంకానుంది.