చంద్రబాబు ఇల్లు కూల్చివేస్తున్నామన్నది అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజిక్కడ బొత్స మాట్లాడుతూ లబ్ధిపొందేందుకే ప్రతిపక్ష నేత ఇల్లు కూల్చివేత అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదన్నారు. కరకట్ట నిర్మాణాలకు మొన్న ఇచ్చింది చివరి నోటీసులు అని స్పష్టం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అక్కడ ఉండొచ్చా? అని ప్రశ్నించారు. పూలింగ్ అక్కడి వరకు వచ్చి ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. నిర్మాణాలు సక్రమమే అయితే కోర్టుకు వెళ్లొచ్చు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఇల్లే కాదు.. కరకట్టపై ఉన్నవన్నీ కూల్చివేస్తామన్నారు. అక్రమ నివాసంలో ఉండి చంద్రబాబు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.