సూపర్ 30 సంస్థ వ్వవస్థాపకుడు, ప్రముఖ గణితవేత్త ఆనంద్ కుమార్ అమెరికా ప్రతిష్టాత్మక బోధనా పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలో అణగారిన, వెనుకబడిన, పేద విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన సేవలను గుర్తించిన అమెరికా ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డ్-2019ను ఆయనను ఎంపిక చేసింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎక్స్లెన్స్ (ఎఫ్ఎఫ్ఈ) సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆనంద్కుమార్కు ప్రదానం చేసింది. ఆనంద్ కుమార్ గత 18 సంవత్సరాలుగా సూపర్ 30 సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భారత ఐఐటీల్లో ప్రవేశాలు కోరే 30 పేద విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ను అందిస్తున్నారు.