అమరావతి : వ్యవసాయ అనుబంధ రంగాలపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సేద్యానికి రైతులను సిద్ధం చేయాలని, మట్టి నమూనాల విశ్లేషణ వందశాతం పూర్తికావాలని ఆయన అధికారులకు సూచించారు. మైక్రో న్యూక్రియంట్స్ వినియోగం సంతృప్తి స్థాయికి చేరాలని, ఆర్ధిక రంగంలో వ్యవసాయానిదే కీలకపాత్ర అని అన్నారు. గత ఏడాది 14 శాతం వృద్ధి సాధించామని, ఈ ఏడాది 20 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యమని సీఎం తెలిపారు. పండ్లతోటల దిగుబడితో పెంచడంతోపాటు నాణ్యత తగ్గకూడదని, మే చివరినాటికి రైతులకు ఇన్పుట్ సబ్సిడి అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.