విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్రణాళికా, ప్రజారోగ్యశాఖ, రెవెన్యూకు విభాగాలకు సంబంధించిన సిబ్బంది సుమారు 25 మందికి పైగానే కార్పొరేషన్ కార్యాలయంలో అర్ధరాత్రి 12 దాటే వరకూ విధులు నిర్వహిస్తున్నారు. ఈవిషయమై అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్ఐలు సాయి, కిరణ్లను సంప్రదించగా ఆరురోజులుగా అర్థరాత్రి దాటినంతవరకూ విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఇళ్లకు సంబంధించి 30వేల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటిని పరిశీలించి తక్షణం ఆన్లైన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో త్వరగా పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యామన్నారు.