అమరావతి : పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఏపీ ఆర్టీజీఎస్ తెలిపింది. ఆ ప్రభావంతో కోస్తాంధ్రలో ఈనెల 23 నుంచి 26 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మళ్లీ కృష్ణా, గోదావరి నదులకు వరద సూచనలున్నాయని గురువారం హెచ్చరించింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఈ రెండు నదులకు భారీగా రానున్న వరదతోపాటు వర్షాలకు భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.