కడప జిల్లాలో, రాజుపాలెం మండలం, గాదెగూడూరుకు చెందిన తిరుపతిరెడ్డి తన భార్యా బిడ్డలతో కలిసి గురువారం కూలూరు గ్రామం వద్ద కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి 2 గంటల నుండి వీరు అదృశ్యం కావడం వీరి బైక్ కుందూ నది ఒడ్డున ఉండటంతో గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.