ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో కుప్పకూలిన డ్రోన్!

national |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 12:26 PM

భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అభివృద్ధి చేసిన మానవరహిత విమానం(డ్రోన్) కూలిపోయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా, సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా పొలాల్లో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో డ్రోన్ ముక్కలుముక్కలైంది. దీనిని చిత్రదుర్గలోని డీఆర్ డీవో కేంద్రం నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న డీఆర్ డీవో శాస్త్రవేత్తలు, అధికారులు డ్రోన్ శకలాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com