శ్రీనగర్: భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలో నెలరోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భద్రతాసిబ్బందిపై కొందరు విద్యార్థులు రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఏప్రిల్ 17 నుంచి అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే తాజాగా మరో నెలపాటు ఈ సేవలను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. అయితే బ్రాడ్బ్యాండ్ సేవలు కూడా నిలిపివేయనున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.