ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోటు ప్ర‌యాణాల‌పై సిఎం జ‌గ‌న్‌ క‌ఠిన నిర్ణ‌యాలు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2019, 12:24 PM

 తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు  ప్రమాదానికి కారణమైన బోటు నిర్వహణా సంస్థతో పాటుగా కారకులైన ప్రతీ ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసారు.  ఈ మేర‌కు  సోమవారం  ఉదయం ఆయ‌న ప్రత్యేక హెలికాప్టర్ లో   గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయిన ప్రాంతాన్ని సంద‌ర్శించిన అనంర‌తం సహాయక చర్యలను ఆయన పరిశీలించారు.   గోదావరి నదిలో వరద ఉధృతిపై అధికారులు  సీఎంకి వివ‌ర‌ణ‌లు ఇచ్చారు. సుడులు కార‌ణంగానే బోటు బోల్తా ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని చెప్పారు. దీంతో బోటుకు అనుమ‌తులు లేవ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ, ఈ బోటు నదిలోకి వెళ్తున్న సమయంలో డ్యూటీలో ఉండాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసారు. ఇప్ప‌టికే  ఘటన జరిగిన వెంటనే ప్రాధమిక నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి బోటుల నిర్వహణ ను తాత్కాలికంగా రద్దు చేయ‌గా, సహాయ చర్యలు స‌మీక్షించాక‌ ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com