ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు, ఇప్పుడు ప్ర‌మాదానికి కార‌కుడు ఒక్క‌డే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2019, 11:37 AM


అనుమతులు లేని లాంచీలు, అక్రమార్జనకు అల‌వాటు ప‌డ్డ అధికారులు, బోటు నిర్వాహ‌కుల అత్యాస‌లు, తగు జాగ్రత్తలు తీసుకోని పర్యాటకులు, గోదావ‌రిపొంచి ఉన్న సుడిగుండాలు వెరసి పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయన్న‌ది చేదునిజం. గ‌తంలో బోటు ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మైన వ్య‌క్తిని స‌స్పెండ్ చేస్తే తిరిగి ఆత‌నికి ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డ‌మే తాజా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే రెండేళ్ల క్రితం అంటే 2017 నవంబరు 12న గోదావరిలోని పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ ప్రమాద ఘటనలో పర్యాటక శాఖ ఉద్యోగులు బీనామీలతో బోటును నడిపించి ప్రమాదానికి కారణమయ్యారని తేలడంతో అప్పటి ప్రభుత్వం ప్రమాద ఘటన కుబాధ్యులుగా భావించి 8 మందిపై వేటు వేసింది. వీరిలో పర్యాటక రవాణా విభాగానికి జనరల్ మేనేజర్ గా ఉన్న రామకృష్ణ కూడా ఉన్నారు. అయితే రామకృష్ణ తిరిగి ఉద్యోగంలోకి వచ్చేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేసినా అప్ప‌టిలో పర్యాటక ఎండిపై ఎంత ఒత్తిడి తెచ్చినా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోడానికి ఆయ‌న‌ ససేమిరా అన్నారు. 2017 బోటు ప్రమాద ఘటన సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విచారణ సైతం పూర్తి కాక ముందే తాజాగా ఏపీ లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్రభుత్వం స‌ద‌రు అధికారిని రాజమార్గంలో తిరిగి పర్యాటక శాఖ లో రవాణా జీఎంగా నియ‌మించ‌డంతో ఆయ‌న‌ బాధ్యతలు చేపట్టారు. ఈత‌ని ఆధ్వ‌ర్యంలో పర్యాటక శాఖ లో గోదావ‌రిలో బోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక బస్సులు నడుస్తున్నాయి







గతంలోనూ జరిగిన బోటు ప్రమాదంలో పర్యాటకశాఖ జనరల్ మేనేజర్ గా నాడు విధులు నిర్వర్తించింది సదరు జనరల్ మేనేజర్ రామకృష్ణనే . నే కావటం , ఇప్పుడు కూడా ఆ అధికారే జనరల మేనేజర్ గా వుండటం ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అవుతుంది. దీనివెనుక మ‌త‌ల‌బులు , అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఎంత పెద్ద తప్పు అయినా కప్పిపుచ్చుకోవచ్చు అన్న దానికి నిదర్శనమ‌ని ఇత‌నితో పాటు అప్పుడు సస్పెన్షన్ కు గురైన మిగతా ఏడుగురికి సంబంధించిన వారితో పాటు స‌ద‌రు ప‌ర్యాట‌క శాఖ ఉద్యోగులు చెపుతున్న మాట‌.



ఇప్పుడు కచ్చులూరు ప్రమాద ఘటనలో కూడా రాయల్ పున్నమి బోటు కు అనుమతి లేదని తేలడం, ఇక ఈ విభాగానికి జనరల్ మేనేజర్ గా రామకృష్ణని విధుల‌లో నియ‌మించిన వైసిపి స‌ర్కారు బాధ్య‌త వ‌హిస్తుందా? అన్న మాట ఇప్పుడు నెటిజ‌న్ల‌లో వైర‌ల్ అవుతున్న మాట‌.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com