ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కు చిన్నారి లేఖ..స్పందించిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2019, 03:09 PM

ఏపీ లోని ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు నుంచి వెలివేయడంతో  కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు పలు దినపత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి. తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు విన్నవించుకుంది. తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది.  ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com