వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైసీపీ పాలనో పారదర్శక, దార్శనికత లోపించిందన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందన్నారు. వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందన్నారు. పునరావాస చర్యల్లోనూ పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందన్నారు.