ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య సలహాదారుగా మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. 1977 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారైన పీకే సిన్హా గత నెలలో పీఎంవోలో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమితులవగా నేటి నుంచి పీఎం ముఖ్యసలహాదారుగా కొనసాగనున్నారు. ఈమేరకు అపాయింట్ మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ప్రతిపాదనలను ఆమోదించగా పీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.