అనంతపురం : వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… టీడీపీ, బీజేపీలు పాలన వదిలి పార్టీ బలోపేతం కోసం పాకులాడుతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్రంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.