తెలుగు వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎట్టకేలకు ఆమోదించింది. 11 ఏళ్ల క్రితం మైసూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించాలని నిర్ణయించారు. దేశంలోని భాషల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూరులో 1969లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ (సీఐఐఎస్)ను ఏర్పాటు చేసింది. 2004లో తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. 2008 అక్టోబరు 31న తెలుగు, కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా గుర్తించింది. ప్రాచీన హోదా కల్పించిన వెంటనే తమిళ, తెలుగు, కన్నడ భాషల అధ్యయనానికి సీఐఐఎల్లోనే భాషల వారీగా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే తమిళనాడు రాష్ట్రం తమ భాష అధ్యయన కేంద్రాన్ని వెంటనే స్వరాష్ట్రానికి తరలించుకుపోగా.. కర్ణాటక కూడా తమ అధ్యయన కేంద్రాన్ని వేరే అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. తెలుగు భాష అధ్యయన కేంద్రం మాత్రం ఇప్పటికీ మైసూరు సీఐఐఎల్లోనే కొనసాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటవడంతో అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తేలక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పక్కనపెట్టింది. నెల్లూరుకు దీనిని తరలించేందుకు అంగీకరించింది.