హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, బిఎస్పి అధినేత్రి మాయావతి మధ్య సోమవారం జరిగిన సమావేశం తో ఇరుపార్టీలు ఎన్నికల నాటికీ జతకట్టే ఆస్కారం కనిపిస్తోందన్నది విశ్లేషకుల మాట
ఆదివారం రాత్రి అరగంటకు పైగా జరిగిన ఈ ఇరువురు నేతల సమావేశంలో కొత్తగా నియమితులైన హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారి సెల్జా కూడా ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం హర్యానాలో ముందస్తు ఎన్నిక లు రావచ్చంటూ జరుగుతున్నా ప్రచారంతో , కాంగ్రెస్, బిఎస్పిల మధ్య సీట్ల ఒప్పందం జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సభ్యులు కొందరు సోమవారం మీడియాకి తెలిపారు.
గతంలో మాయావతి, జెజెపి అధినేత చౌతాలాతో కుదిరిన ఒప్పందం సహేతుకంగా లేదని విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ మాయ సమావేశం కీలకంగా మారింది.