ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొత్స వ్యాఖ్యలపై యనమల కౌంటర్ 

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 03:44 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు.  అమరావతే రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదంటూ చేసిన బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డారు.  అమరావతిపై గెజిట్ లేదంటున్న మంత్రి బొత్స ఎందుకు అక్కడ కూర్చొని పాలన చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్రమోదీ అని తెలియదా అంటూ నిలదీశారు. రాజధాని భవనాలను పాలనకు ఎలా వాడుతున్నా రంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధాని కాకపోతే సీఎం జగన్ అమరావతిలో రాజధాని భవనాల్లో ఉంటూ పాలన ఎలా కొనసాగిస్తున్నారంటూ నిలదీశారు. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయోద్దంటూ హితవు పలికారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com