విజయవాడ, సూర్య బ్యూరో : నాయకుడు అనేవాడు ప్రజలతో మమేకం కావాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల మద్దతు లభి స్తుందని, తెలుగుదేశం పార్టీకి ప్రజలలో నమ్మకం, కార్యకర్తలే బలమని వారు లేనిదే పార్టీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్సెంటర్లో శుక్ర వారం నిర్వహించిన పార్టీ రాష్ర్ట స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గడచిన 35 ఏళ్లుగా పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొనప్పటికీ కార్యకర్తలు వెన్నంటే ఉన్నారని అన్నారు. పాతతరం వారిలో అనుభవం, కొత్త తరంవారిలో సాంకేతికతతో పార్టీ ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ మీద నమ్మకం ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ర్టంలో శాశ్వతంగా టీడీపీనే అధికారంలో వుండాలని, మన పాలనలో ప్రజల్లో 80శాతం సంతప్తి పెరగాలని పార్టీ నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. విభజన అనంతరం రాష్ర్టం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.6,400 కోట్లు రుణమాఫీ చేశా మని పేర్కొన్నారు. సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.