కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణాజిల్లాలో పర్యటించారు. నందివాడ మండలం జనార్ధనపురంలో పర్యటించిన గిరిరాజ్ రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకున్న మంత్రి ఆక్వా, మత్స్య అభివృద్ధిలో రాష్ట్రం ముందుందని, సమస్యలు తలెత్తితే ఇక్కడి ఆక్వా రైతులు చెన్నై వెళ్తున్నారని, ఇక్కడే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని, పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఆక్వా, మత్య్స రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. వివిధ పథకాల ద్వారా యువతకు చేయూతనిస్తామన్నారు.