తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు, ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం తెలుగుదేశం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. సామర్లకోట మండలం అచ్చంపేటలోని కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు. ఎల్లుండి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు.