విజయవంతంగా తన లక్ష్యం వైపు దూసుకెళ్తున్న చంద్రయాన్-2.ఈ నెల 7న చోటుచేసుకోనున్న అంతిమ ఘట్టం. చంద్రయాన్-2లోని ల్యాండర్ ‘విక్రమ్’ కక్ష్యను ఈ తెల్లవారుజామున 3:42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ల్యాండర్లోని ప్రొపల్షన్ సిస్టంను 9 సెకన్లపాటు మండించడం ద్వారా దాని కక్ష్యను రెండోసారి విజయవంతంగా తగ్గించారు. ఫలితంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండర్ మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ 35 కిలోమీటర్లు X 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. ఆర్బిటర్ 96 కిలోమీటర్లుX125 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది.